క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ పేరుతో ఓ మహిళను సైబర్ చీటర్లు మోసం చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన 46 ఏళ్ల మహిళ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తోంది. సైబర్ నేరగాళ్లు ఆమెకు యాక్సిస్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఆఫర్ మరియు లింక్ను పంపారు. స్కామర్లు సూచించినట్లుగా, బాధితురాలు తన వ్యక్తిగత వివరాలతో పాటు కోటక్ మహీంద్రా మరియు SBI బ్యాంకుల క్రెడిట్ కార్డ్ వివరాలతో అప్లికేషన్లో అప్లోడ్ చేసింది. అనంతం కార్డుల నుంచి 1లక్ష 15 వేల రూపాయలు కట్ అయ్యాయి. మోసం గురించి తెలుసుకున్న మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.