Gold At Half Price

Gold At Half Price: బంగారం అంటే మనకు ప్రత్యేకమైన ఆసక్తి. భారీ డిమాండ్‌తో ఇప్పటికే తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటింది. పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర అవసరాలకు ప్రజలు కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితిని దుర్వినియోగం చేసుకుంటూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సగం ధరకే బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసి, 12 లక్షల రూపాయల నగదుతో పరారయ్యారు. దీంతో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మి ఆర్థిక నష్టంతో బాధపడుతున్నారు.

గత నెలలో రిషి అనే వ్యక్తి శ్రీలక్ష్మిని సగం ధరకే బంగారం ఇస్తానని నమ్మించాడు. పావు కిలో బంగారం కోసం రూ. 12 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ మొత్తం శ్రీలక్ష్మి సిద్ధం చేసి, రిషితో ద్విచక్ర వాహనంపై పాలకొండకు వెళ్లారు. అక్కడ నుంచి పార్వతీపురం వైపు బంగారం చూపిస్తామని తీసుకెళ్లారు. పట్టణ శివారులో ఉన్నప్పుడు, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి, మహిళ ముఖంపై పౌడర్‌ జల్లి, 12 లక్షల రూపాయల నగదుతో పారిపోయారు. బాధితురాలు వెంటనే పార్వతీపురం గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిషిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Internal Links:

ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగల బీభత్సం..

కోల్‌కతాలో ఐఐఎం విద్యార్థినిపై అత్యాచారం..

External Links:

సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *