Guntur Crime News Wife Kills Husband: ప్రియుడితో కలవడానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య, పక్కా ప్రణాళికతో అతడిని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో జరిగింది. శివనాగరాజు–మాధురి దంపతులకు 2007లో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాధురి విజయవాడలో సినిమా హాల్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తుండగా సత్తెనపల్లికి చెందిన గోపితో పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. తర్వాత భర్తను ఉద్యోగం పేరుతో హైదరాబాద్లో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్న గోపి వద్దకు పంపించింది. కొంతకాలానికి శివనాగరాజు తిరిగి చిలువూరు వచ్చి ఇంటి నుంచే వ్యాపారం చేయడంతో మాధురికి ప్రియుడితో కలవడం కష్టమైంది.
భర్తను తొలగించుకోవాలని నిర్ణయించిన మాధురి, బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి శివనాగరాజుకు ఇచ్చింది. అవి తిని నిద్రపోయిన తర్వాత ప్రియుడు గోపితో కలిసి అతడిని హత్య చేసింది. ఉదయం గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించేందుకు ప్రయత్నించింది. అయితే అనుమానం వచ్చిన మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం బయటపడింది. పోలీసులు మాధురి, గోపిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రేణు అగర్వాల్ దారుణ హత్య
External Links:
భార్య చేతిలో మరో భర్త బలి.. ప్రియుడుతో కలిసి..!