నిన్న సాయంత్రం హబ్సిగూడలో లారీ ప్రమాదానికి గురి అయిన బాలిక కామేశ్వరి సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. హబ్సిగూడలో లారీ ఢీకొని ఆరో తరగతి విద్యార్థి మృతి చెందింది. తార్నాక డివిజన్ హనుమాన్ నగర్ స్ట్రీట్ నెం.12లో నివాసం ఉంటున్న సంతోషి, నీల్కుమార్ దంపతుల పెద్ద కుమార్తె కామేశ్వరి(10) ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. కుమారుడు వేదాంష్ కూడా అదే పాఠశాలలో చదువుతున్నాడు. ఎప్పటిలాగే సంతోషి మధ్యాహ్నం పాఠశాల నుంచి పిల్లలను తీసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది.
హబ్సిగూడలో వీరి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో కిందపడిపోయారు. కామేశ్వరిపై నుంచి లారీ దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా అప్పటికే కామేశ్వరి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లారీ డ్రైవర్ మియారం జుట్ (40)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక కామేశ్వరి దృశ్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో కూతురిని పట్టుకొని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లి స్థానికులను కంటతడి పెట్టించింది.