శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో ఆ వ్యక్తి కారు అద్దంలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో మృతుడి తల తెగిపడటంతో భయాందోళన వాతావరణం నెలకొంది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ ఉట్ పల్లి గ్రామానికి చెందిన తొట్ల అంజయ్యగా గుర్తించారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అంజయ్య మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.