నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కారును టెంపో ట్రావెలర్ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను బొటిక శ్రీనివాసులు, పుష్ప, శ్రీకాంత్ లుగా పరిగణించారు. అతి వేగంగా కారును నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. టెంపోను ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *