విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, పదకొండు మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే, యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని ఎల్లం బావి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వెనుకనుంచి బలంగా ఢీ కొట్టడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ఇద్దరు మరణించారు. మరణించిన ప్రయాణికులు ఇద్దరు నిద్రలో ఉన్నారు.

ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన సతీశ్ కుమార్, తేజగా పోలీసులు పరిగణించారు. బాధితుల కుటుంబాలకు సమాచారం అందించిన పోలీసులు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగంతోనే కంటైనర్ ఢీకొట్టడం వల్ల ఇంతటి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *