జగిత్యాల: కోరుట్ల రూరల్ మండలం మోహనరావుపేటలో ఆస్తి తగాదాల కారణంగా ఓ యువకుడిని అతని తండ్రి కత్తితో పొడిచి చంపాడు. గ్రామస్తుల కథనం ప్రకారం గంగరాజన్‌కు రాకేష్‌, రాజేష్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి ఆస్తి పంపకాలపై రాకేష్, రాజేష్ ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. వాగ్వాదం తీవ్రంగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న గంగరాజన్ కత్తితో రాజేష్‌పై దాడి చేశాడు. గాయపడిన రాజేష్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే ఆయన తుది శ్వాస విడిచారు.  విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గంగరాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *