Trump vs Democrats: భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ టారిఫ్లపై యూఎస్లో రాజకీయ వివాదం మొదలైంది. ఈ టారిఫ్లను వ్యతిరేకిస్తూ డెమోక్రటిక్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. భారతీయ దిగుమతులపై 50 శాతం వరకు టారిఫ్లు తొలగించాలని డెబోరా రాస్, మార్క్ వీజీ, రాజా కృష్ణమూర్తి కలిసి ప్రతిపాదన పెట్టారు. ట్రంప్ భారత్పై రెండు దఫాలుగా టారిఫ్లు విధించడంతో భారత ఉత్పత్తుల దిగుమతి ఖర్చులు భారీగా పెరిగాయి.
ఈ టారిఫ్లు చట్టవిరుద్ధమని, అమెరికా ప్రజలపై ధరల భారం పెంచుతున్నాయని డెమోక్రటిక్ ఎంపీలు విమర్శించారు. భారత్తో ఉన్న ఆర్థిక సంబంధాలు దెబ్బతింటాయని, ఉద్యోగాలు, పెట్టుబడులపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ట్రంప్ అత్యవసర అధికారాలను ఉపయోగించడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. వాణిజ్య విధానాలు రూపొందించే అధికారం కాంగ్రెస్కే ఉందని చెబుతూ, అధ్యక్షుడి అధికారాలకు పరిమితులు విధించే బిల్లుపై ముందుకు వెళ్తోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పుతిన్ యుద్ధాన్ని ఎందుకు సాగదీస్తున్నారో అర్థం కావడం లేదు…
ఇజ్రాయెల్ నుంచి ట్రంప్కు అత్యున్నత గౌరవం: ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్’ ప్రకటింపు
External Links:
భారత్పై 50 శాతం సుంకాలన్ని రద్దు చేయాలి.. డెమోక్రట్ల డిమాండ్