ప్రముఖ తెలుగు యంగ్ నటుడు రాజ్ తరుణ్ మరియు లావణ్య ప్రేమ వ్యవహారం రెండు తెలుగు రాష్టాలలో చర్చగా మారింది. లావణ్య ,రాజ్ తరుణ్ తనతో గత 11 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, వారిద్దరూ కలిసి ఓ ఇంట్లో ఉంటున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ పేర్కొంది. మేమిద్దరం త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఫిర్యాదులో పేర్కొంది. అయితే, గత కొన్నాళ్లుగా మాల్వీ కుటుంబ సభ్యులు ఆమెను చంపేస్తామని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించడంతో రాజ్ తరుణ్ ఆమెను తప్పించాడు. రాజ్ తరుణ్ మరియు మాల్వి కలిసి తిరుగుతున్నారని మరియు గోవా, పుదుచ్చేరి, చెన్నై మరియు ఇతర ప్రాంతాలకు తరచుగా కలిసి వెళుతున్నారని ఆమె ఆరోపించారు. ఇటీవల నమోదు చేసిన కేసుని లావణ్య ని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆ బాధ భరించలేక లావణ్య ఆత్మహత్యానికి పాల్పడినట్టు సమాచారం. ఆత్మహత్యానికి పాల్పడే ముందే తన న్యాయవాదికి మరియు పోలీసులకు సమాచారం చేరవేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు వచ్చి లావణ్యాన్ని రక్షించారు. న్యాయవాది దిలీప్ సుంకరను , తనకి న్యాయం చేయమని, తనని వివిధ కేసులలో ఇరికిస్తున్నారని తనని కాపాడమని ఆశ్రయించింది అని న్యాయవాది పేర్కొన్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ మీద కేసు పెట్టిన తగిన చర్యలు తీసుకోవట్లేదు అని పేర్కొన్నారు. ఇవి అన్నిటికి సమాధానం దొరకాలంటే రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ,తనకి తగిన న్యాయం చేయాలనీ పేర్కొన్నారు .