ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 488 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మెంబర్‌ సెక్రటరీ విడుదల చేశారు. డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు సమాచారం. కావున ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు మెంబర్ సెక్రెటరీ వివరాలు వెల్లడించారు. బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయని, డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ ద్వారా భర్తీ చేపట్టనున్నట్లు వివరించారు. ఈ నియామకాలను శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://dme.ap.nic.in https://apmsrb.ap.gov.in/msrb/ సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *