విశాఖపట్నంలో వివాదాస్పదంగా మారిన రామా నాయుడు స్టూడియో భూములు స్వాధీనానికి రంగం సిద్దం అయింది. ప్రభుత్వ ప్రకటనకు ప్రతిస్పందనగా సురేష్ ప్రొడక్షన్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు వైజాగ్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. షోకాజ్ నోటీసులకు వచ్చిన ప్రతిస్పందనల ఆధారంగా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

మధురవాడ సర్వే నంబర్ 336/Pలో 34.44 ఎకరాలు మరియు మరికొన్ని నంబర్లను ప్రభుత్వం సురేష్ ప్రొడక్షన్స్‌కు స్టూడియో మరియు ఫిల్మ్ ప్రొడక్షన్ అవసరాల కోసం కేటాయించింది. అయితే, రామానాయుడు స్టూడియో భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగినట్లు ప్రభుత్వం గుర్తించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *