Breaking Telugu News-

News5am,Breaking Telugu News- (09-05-2025): భారత్-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. పాక్‌ దాడులను భారత్‌ సమర్థవంతంగా తిప్పికొడుతున్నా, కొన్ని ప్రాంతాల్లో ప్రాణనష్టం తప్పడంలేదు. సాధారణ ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోగా, శత్రుదేశంతో పోరాడుతూ కొందరు జవాన్లు వీరమరణం పొందుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాకు చెందిన జవాన్‌ మురళీనాయక్‌ వీరమరణం పొందగా, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్‌ ఏర్పాట్లు చేస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు. సచిన్‌ వయస్సు 29 ఏళ్లు. ఆయన స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. సచిన్ మృతితో తమ్లూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన పార్థివదేహాన్ని ఇవాళ స్వస్థలానికి తరలించేందుకు ఇండియన్ ఆర్మీ ఏర్పాట్లు చేస్తోంది.

More News:

Breaking Telugu News-

భారత్, పాక్ యుద్ధంతో మాకే సంబంధం లేదు..

పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

More Breaking Telugu New: External Sources

ఆపరేషన్ సిందూర్: పార్క్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *