కోళ్లలో వేగంగా వ్యాప్తిస్తోన్న వైరస్ పట్ల రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాలకు సూచించింది. దీంతో, అలర్ట్ అయిన తెలంగాణ పశు సంవర్ధక శాఖ. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. టీజీ పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్, జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు బయో సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, అనారోగ్యంతో, వైరస్ సోకిన కోళ్లను దూరంగా పూడ్చిపెట్టలని స్పష్టం చేశారు. వైరస్ సోకిన కోళ్ల తరలింపులో కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
రాజమండ్రిలో చికెన్ మార్కెట్ అమ్మకాలు లేక వెలవెలబోతుంది. చికెన్ రేటు కూడా కేజీకి 30 రూపాయలు తగ్గిపోయింది. పౌల్ట్రీ నుంచి వచ్చే కోళ్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. బర్డ్ ఫ్లూ నేపద్యంలో జిల్లా లో అంగన్వాడీ కేంద్రాలకు కోడి గుడ్ల సరఫరా నిలిపివేశారు. దీనితో చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు భారీగా పడిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కాగా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఈ బర్డ్ ఫ్లూ టెన్షన్ పెడుతోన్న విషయం విదితమే.