News5am Latest Telugu News (07/05/2025) : హైదరాబాద్ నగరంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు నగర పోలీసులు మాక్డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజల మొబైల్ ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపనున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు నిమిషాల పాటు సైరన్ శబ్దం వినిపించనుంది.
సైరన్ శబ్దం వినిపించిన వెంటనే ప్రజలు సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఇది కేవలం సాధన మాత్రమేనని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. భద్రతా దళాలకు సంఘీభావం వ్యక్తం చేస్తూ, గురువారం నగరంలో ఒక ర్యాలీ కూడా నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
Telugu Latest News Headlines
Telugu Latest News Headlines :
ఏపీకి ముందుగానే నైరుతి రుతుపవనాలు..
హైదరాబాద్ వాసులకు IMD బిగ్ అలర్ట్..
More Latest News : External Sources
https://www.ap7am.com/tn/828581/hyderabad-mock-drill-citizens-urged-to-move-to-safe-zones