భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. వచ్చే నెలలో ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ధోనీ సొంత రాష్ట్రం ఝార్ఖండ్ కావడంతో ప్రజలపై ప్రభావం చూపే సెలబ్రిటీ సామాజిక బాధ్యత తీసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. ఈ మేరకు ధోనీ ఝార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. అలాగే ఎన్నికల ప్రచారంలో తన ఫొటోను వాడుకునేందుకు కూడా ఎంఎస్డీ ధోని అంగీకరించినట్లు ఈసీ వెల్లడించింది.
ఇదిలాఉంటే, వచ్చే ఏడాది జనవరి 5తో ఝార్ఖండ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. దాంతో ఈ నవంబర్లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఝార్ఖండ్లో మొత్తం 81 స్థానాలకు నవంబర్ 123, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. మొదటి విడుత కోసం శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తియైన విషయం తెలిసిందే.