ఏపీలో నేటి నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రానుంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై భారీగా జరిమానాలు విధించనున్నారు.

  • హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 1,000 జరిమానా
  • సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ. 1,000 జరిమానా
  • మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు
  • సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ రూ. 1,000 జరిమానా
  • డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5,000 జరిమానా మరియు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం
  • మొదటిసారి సెల్‌ఫోన్ ఉపయోగించి డ్రైవింగ్ చేస్తే రూ. 1,500… రెండోసారి రూ. 10 వేల జరిమానా
  • బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,000 జరిమానా
  • వాహనాల రేసింగ్ కు పాల్పడితే తొలిసారి రూ. 5 వేలు, రెండోసారి రూ. 10 వేల జరిమానా
  • ఆటోడ్రైవర్లు యూనిఫాం లేకుండా వాహనాలు నడిపితే తొలిసారిగా రూ. 150, రెండోసారి రూ. 300 జరిమానా

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *