ఏపీలో నేటి నుంచి కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి రానుంది. కొత్త ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై భారీగా జరిమానాలు విధించనున్నారు.
- హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. 1,000 జరిమానా
- సీట్ బెల్ట్ లేకుండా కారు నడిపితే రూ. 1,000 జరిమానా
- మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ. 10,000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు
- సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ రూ. 1,000 జరిమానా
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5,000 జరిమానా మరియు వాహనాన్ని సీజ్ చేసే అవకాశం
- మొదటిసారి సెల్ఫోన్ ఉపయోగించి డ్రైవింగ్ చేస్తే రూ. 1,500… రెండోసారి రూ. 10 వేల జరిమానా
- బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ. 1,000 జరిమానా
- వాహనాల రేసింగ్ కు పాల్పడితే తొలిసారి రూ. 5 వేలు, రెండోసారి రూ. 10 వేల జరిమానా
- ఆటోడ్రైవర్లు యూనిఫాం లేకుండా వాహనాలు నడిపితే తొలిసారిగా రూ. 150, రెండోసారి రూ. 300 జరిమానా
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు.