నేడు రాష్ట్రంలో అసలైన ప్రక్రియ, సమగ్ర కుటుంబ సర్వే. మొదటి దశ (బుధవారం) నుంచి ఎన్యుమరేటర్లు కుటుంబాలను గుర్తించి సిబ్బంది ఇళ్లకు స్టిక్కర్లు అంటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి ప్రజల నుంచి వివరాలు సేకరించనున్నారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర వర్గాలకు అభివృద్ధి, అవకాశాలు కల్పించేందుకు అవసరమైన ప్రణాళికల కోసం సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే డేటా ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఇదిలా ఉండగా, కుటుంబ వివరాలను సేకరించడమే కాకుండా, వృత్తి, వ్యాపార, ఉద్యోగాల నిమిత్తం స్వగ్రామాల్లోని ఇళ్లను వదిలి సుదూర పట్టణాలు, నగరాల్లో నివసించే వారికి రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సర్వేలో కుల వివరాలు ఎన్యుమరేటర్లు నేటి నుంచి సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసి పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే స్టిక్కరింగ్ 95 శాతం పూర్తయింది. GHMC పరిధిలో 19,722 ఎన్యూమరేటర్లు పని చేస్తున్నారు. ఈరోజు నుంచి సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు. నేటి నుంచి 21 వరకు ఇంటింటికి తిరిగి సర్వే వివరాలు ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. మొత్తం 243 కులాలను ఫైనల్ చేసి క్యాస్ట్ కోడ్స్ లిస్ట్ చేసిన అధికారులు. ఎస్సీ కేటగిరీలో 59 కులాలు, ఎస్టీ కేటగిరిలో 32 కులాలు, ఇక 134 కులాలు, ఓసీ కేటగిరిలో 18 కులాలు బీసీ కేటగిరి లో చేర్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *