తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేశారు. చాలా తక్కువ సమయంలో ఫలితాలను విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు.
1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. అలాగే దసరా పండుగలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అందజేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.