తెలంగాణ ప్రభుత్వం పలువురు డిప్యూటి  తహశీల్దార్‌లకు  తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 83 మంది డిప్యూటి తహశీల్దార్‌లకు  తహసీల్దార్ లుగా ప్రమోషన్ కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవెన్యూ మంత్రి, సీసీఎల్ఏకు టీజీటీఏ ధన్యవాదాలు తెలియజేసింది. తెలంగాణ ఉద్యోగుల చైర్మన్ లచ్చిరెడ్డి, టీజీటీఏ కృషి ఫలితంగానే డీటీలకు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించిందని తహసీల్దార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. గతంలోనూ ప‌దోన్నతుల‌ను ఇప్పించిన చ‌రిత్ర టీజీటీఏకే ఉంద‌న్నారు.

ఈ సందర్బంగా తెలంగాణ త‌హ‌శీల్దార్స్ అసోసియేష‌న్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రాములు, ప్రధాన కార్యద‌ర్శి ర‌మేశ్‌ పాక‌, సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ ఫూల్‌సింగ్ చౌహాన్, మ‌హిళా విభాగం అధ్యక్షురాలు రాధ‌, సీఎం రేవంత్‌, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ‌నివాస్‌రెడ్డికి, సీసీఎల్ఏ న‌వీన్ మిట్టల్‌కి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ప‌దోన్నతుల కోసం ఎదురు చూసే డీటీల‌కు త‌హ‌శీల్దార్లుగా అవ‌కాశం క‌ల్పించ‌డంతో చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *