హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో వైరస్ విజృంభిస్తోంది. వేగంగా విస్తరిస్తున్న నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరవాసులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ఎక్స్ వేదికగా పలు ఆదేశాలు జారీ చేసింది. భాగ్యనగర్ వాసులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ‘నోరో వైరస్‌తో జాగ్రత్త!! ఈ వ్యాధి కలుషిత నీరు మరియు ఆహారం ద్వారా వ్యాపిస్తుంది’ అని పేర్కొంది. చలిజ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపునొప్పి, డీహైడ్రేషన్ నోరో వైరస్ యొక్క గుర్తించబడిన లక్షణాలు. ప్రస్తుతం యాకుత్‌పురా, మలక్ పేట, డబీర్‌పురా, పురానాహవేలి, మొగల్‌పురా తదితర ప్రాంతాల్లో నోరో వైరస్‌ కేసులు నమోదయ్యాయి. నోరో వైరస్ సోకిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలి.
  • కాచి చల్లార్చిన, వడపోసిన నీటిని తాగాలి.
  • ఇంటిని, పరిసరాలను క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *