నటి ఎమ్మెల్సీ విజయశాంతి, ఆమె భర్తకు బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడని, చంద్రశేఖర్ రెడ్డిపై విజయశాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరకం అంటే ఏమిటో చూపిస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. విజయశాంతి సోషల్ మీడియా ఖాతాను చంద్రశేఖర్ రెడ్డి నిర్వహించేవారు. విజయశాంతి తనను సోషల్ మీడియాలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందని నమ్మించాడు చంద్రశేఖర్ రెడ్డి. విజయశాంతి దంపతులు అతన్ని నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారు. ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాను గమనించకుండా వదిలేశారు.

అతడు చేసిన మోసంపై విజయశాంతి దంపతులు చంద్రశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. తనను ప్రశ్నించడంతో నరకమేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు గురిచేశాడు. విజయశాంతిని బెదిరిస్తూ ఎస్ఎంఎస్, మెయిల్స్ పంపిస్తూ భయబ్రాంతులకు గురిచేశాడు చంద్రశేఖర్ రెడ్డి. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తాజాగా నటిస్తున్న మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో అలరించబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *