Adivi Sesh Mrunal Thakur Dacoit: టాలీవుడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న డెకాయిట్ సినిమాకు షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. మొదట క్రిస్మస్కు విడుదల చేయాలని అనుకున్న ఈ సినిమా విడుదల తేదీని మార్చి, కొత్త తేదీని ప్రకటించారు. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జీప్లో గన్తో శత్రువులను ఎదుర్కొంటూ కనిపించగా, ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. అడివి శేష్ హీరోగా నటించిన క్షణం, గూఢచారి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్గా పనిచేసిన షనీల్ డియో ఈ సారి దర్శకుడిగా మారడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
‘ఓజీ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు…
External Links:
అడివిశేష్, మృణాల్ ఠాకూర్ డెకాయిట్ విడుదలయ్యే టైం ఫిక్స్