నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ లో ఆశించిన స్థాయిలో పెద్ద హిట్స్ సాధించకపోయినా, తన నటనతో మంచి మార్కెట్ ను సృష్టించుకున్నాడు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ మరియు ఇటీవల విడుదలైన ప్రీ-టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ తాజా చిత్రం యొక్క టీజర్ను బృందం విడుదల చేసింది.
తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్, వైరం, ప్రేమ, సెంటిమెంట్ అని కలగలిపి ఈ సినిమా రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో విజయశాంతి పవర్ ఫుల్ పోలీసాఫీసర్గా, ఆమె కొడుకు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు. ఓల్డ్ మూవీ ‘కర్తవ్యం’ లో, వైజయంతి పాత్ర పోషించిన విజయశాంతికి, ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్తో ఈ స్టోరీని డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. ఎంతో ప్రేమగా ఉండే తల్లి కొడుకులు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? వాళ్లిద్దరూ మళ్లీ ఎలా కలుసుకున్నారు? అనేదే ఈ సినిమాలో కీలకమైన మలుపు. మొత్తానికి ఇటు విజయశాంతి, అటు కల్యాణ్ రామ్ మంచి కం బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.