Latest News Telugu

News5am, Latest News Telugu (13-06-2025): విక్టరీ వెంకటేశ్‌ 2025లో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ హిట్ సాధించారు. దర్శకుడు అనిల్ రావిపూడి అందించిన హాస్యం, వెంకటేశ్‌ నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ విజయంతో వెంకటేశ్‌ తదుపరి సినిమా ఎవరితో ఉంటుందనే ఉత్కంఠ పెరిగింది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వెంకటేశ్‌ కలిసి సినిమా చేస్తున్నారని వార్తలు రాగా, తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ వార్తలకు తుది క్లారిటీ ఇచ్చారు. ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ త్రివిక్రమ్‌ తదుపరి రెండు సినిమాలు జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్‌లతోనే లాక్‌ అయ్యాయని తెలిపారు. ఇతర గాసిప్‌లన్నీ పుకార్లే అని స్పష్టం చేశారు. రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ సినిమాలపై వస్తున్న వార్తలు అర్ధం లేనివని తెలిపారు.

త్రివిక్రమ్‌ మొదట వెంకటేశ్‌తో సినిమా చేసి, ఆ తర్వాత ఎన్టీఆర్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందనున్నాయి. గతంలో త్రివిక్రమ్ రచనతో వచ్చిన వెంకటేశ్‌ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ మంచి విజయాలు సాధించాయి. దీంతో వీరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జులై లేదా ఆగస్టులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

More News Telugu:

Latest Telugu:

అఖండ-2 టీజర్ వచ్చేసింది..

థగ్ లైఫ్, షాకింగ్ వీకెండ్ కలెక్షన్లు..

More Latest News Telugu: External Sources

త్రివిక్రమ్‌తో ‘విక్టరీ’ సినిమా.. ఆగస్టులో ఆరంభం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *