టాలీవుడ్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం, కామెడీ, ప్రేమ, స్నేహం ఇతివృత్తాలతో యువతను ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నార్నే నితిన్, సంగీత్ శోభన్ మరియు రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో కొత్తగా విడుదలైన చిత్రాలలో యువత మరియు మిగిలిన ప్రేక్షకులు ‘మ్యాడ్ స్క్వేర్’ వైపు మొగ్గు చూపుతున్నారు.ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కూడా మంచి స్పందన వస్తోంది. మ్యాట్నీ షోలకు ఆక్యుపెన్సీ కొద్దిగా తగ్గినప్పటికీ, మొదటి మరియు రెండవ షోలు బాగా నడుస్తున్నాయి.

మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఈచిత్రానికి 17 కోట్ల గ్రాస్ వసూల్ అవ్వడం విశేషం. ఇక ఇండియాలో మాత్రం రూ.8.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. డే2న కూడా అదే రేంజ్ లో వసూళ్లు అందుకుంది. ఈ చిత్రానికి ఫస్ట్ వీకెండ్ శనివారం కావడంతో మరింత జోరుగా వసూళ్లు రాబట్టింది. ఇండియాలో రూ.8.6 కోట్ల నెట్ అందుకుంది. దీంతో 2 రోజులకు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.17.1 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు అందుకుంది. కాగా ఈ సినిమా నాలుగు రోజుల్లో ఓవరాల్‌గా 69.4 కొట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ టీం తెలిపింది. ఇక గతంలో వచ్చిన ‘మ్యాడ్’ చిత్రం రూ.8 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకొని బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లు రాబట్టగలిగింది. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ లాంగ్ రన్ లో ఎంత వసూల్ చేస్తుందనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *