2023లో ‘మ్యాడ్’ అనే వినోదాత్మక చిత్రం విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు, ఈ చిత్రానికి సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’ వస్తోంది. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది.
నార్నే నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సీక్వెల్ను మరింత వినోదాత్మకంగా తీర్చిదిద్దారు. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా యువత ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో రెండో భాగానికి కూడా సంగీతం అందిస్తున్నారు.