సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి ఏపీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. సూళ్లూరుపేట పోలీసులు పోసానిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పోసాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు, పోసానిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.
కేసులో అదనంగా 111 సెక్షన్ తో పాటు మహిళను అసభ్యంగా చిత్రీకరించారంటూ సెక్షన్లు నమోదు చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించారంటూ విచారణ అధికారి మురళీకృష్ణపై సీరియస్ అయింది. ఈ సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన ప్రశ్నించారు. మురళీకృష్ణకు ఫామ్ 1 నోటీసు జారీ చేసింది. రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేశారు.