ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో సోమవారం పవన్తో సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా పవన్ కళ్యాణ్కు ఆహ్వానించినట్లు తెలిపారు. దీనికి పవన్ ఓకే చెప్పారని వివరించారు. దిల్ రాజు, పవన్లను కలిసినందుకు గాను గేమ్ ఛేంజర్ నిర్మాణ సంస్థ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కి కృతజ్ఞతలు తెలిపింది.