ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలో జనసేన కార్యాలయంలో సోమవారం పవన్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ ఛేంజర్ ఆంధ్రప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని భావిస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. దీనికి పవన్ ఓకే చెప్పారని వివరించారు. దిల్ రాజు, పవన్‌లను కలిసినందుకు గాను గేమ్ ఛేంజర్ నిర్మాణ సంస్థ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *