టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. బాలీవుడ్లో ఆమె చేసిన వెబ్ సిరీస్లు కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ఆమె చివరిగా టాలీవుడ్ చిత్రం ‘ఖుషి’లో నటించింది. సామ్ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమె తన సొంత నిర్మాణ సంస్థ ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ను స్థాపించింది. ఈ సంస్థ నుంచి తొలి చిత్రంగా ‘శుభం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కామెడీతో పాటు హారర్ కూడా ఉందని తెలుస్తోంది. శోభనం గదిలో భార్యాభర్తల మధ్య జరిగే సరదా సంభాషణతో టీజర్ ప్రారంభమవుతుంది. తర్వాత పెళ్లికూతురు రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఈ సమయంలో సీరియల్ ఎందుకు చూస్తున్నావని వరుడు అడగగా, వధువు “ష్” అంటూ అతని వైపు సీరియస్గా చూస్తుంది.