టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుత స్టార్, విజయ్ సేతుపతితో ఒక సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న పూరి ఒక పవర్ ఫుల్ కథను అందించబోతున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ తో కోలీవుడ్ ప్రేక్షకులు నిరాశ చెందారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ పెద్ద హిట్ సాధించి చాలా కాలం అయింది. అలాంటి దర్శకుడితో విజయ్ ఎలాంటి సినిమా తీస్తాడో అని అభిమానులు ఫిర్యాదు చేస్తున్నారు. కానీ, అన్ని రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. పూరి దాని గురించి నమ్మకంగా ఉన్నాడు. మరియు ఈ సినిమాలోని నటులు మరియు నటీమణుల గురించి వార్తలు ప్రతిరోజూ వైరల్ అవుతున్నాయి.

తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ టబు కీల‌క పాత్రలో న‌టించ‌బోతుంది. అదికూడా ఒక సాలిడ్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతుందట. అయితే ముందుగా ఈ రోల్ కోసం విజయశాంతిని అనుకున్నారట కానీ ఆమె రాజకీయాల్లో బిజీ గా ఉండటంతో తర్వాత టబు ను అనుకున్నారట. ఎందుకైనా మంచిదని బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌ని కూడా లైన్లో పెట్టారట. కానీ ఫైనల్‌గా టబుకి ఫిక్స్ అయ్యారు.. అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. ఇక సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ప్రారంభమవుతుందని వెల్లడించగా, త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది మూవీ టీం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *