బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించినందుకు పంజాగుట్ట పోలీసులు 11 మంది ప్రముఖులు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరు కావాలని కోరుతూ పోలీసులు విష్ణుప్రియకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నెల 25న ఆమె మళ్ళీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరుతూ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు ఆమె పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేసేందుకు నిరాకరించింది. విచారణలో పోలీసులకు సహకరించాలని ఆమెను ఆదేశించారు. చట్ట ప్రకారం విష్ణుప్రియను విచారించాలని పోలీసులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *