Bomb threat to Delhi HC: శుక్రవారం (సెప్టెంబర్ 12, 2025) ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కోర్టు ప్రాంగణంలో హడావుడి నెలకొంది. ఉదయం 8.38 గంటల ప్రాంతంలో హైకోర్టు అధికారిక మెయిల్ ఐడికి పేలుడు జరగబోతుందని సమాచారం రావడంతో న్యాయమూర్తులు విచారణలను వాయిదా వేసి, కోర్టు గదులను ఖాళీ చేశారు. భద్రతా చర్యల భాగంగా రెండు అగ్నిమాపక వాహనాలు, రెండు అంబులెన్స్లు, బాంబు నిర్వీర్య దళ వాహనం ప్రాంగణంలో ఉంచబడ్డాయి. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందిని బయటకు తరలించగా, కొందరు కోర్టు ప్రాంగణంలోనే ఉండి వేచిచూశారు.
భద్రతా సిబ్బంది కోర్టు భవనం అంతటా తనిఖీలు జరుపుతుండగా, పోలీసులు PCR కాల్ కూడా స్వీకరించామని తెలిపారు. బాంబు నిర్వీర్య దళం, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలంలో ఉన్నారని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ప్రస్తుతం శోధన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Internal Links:
కర్ణాటకలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు..
External Links:
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు..