News5am,Breaking Telugu New (08-05-2025): జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియానికి ఈరోజు ఉదయం 9:13 గంటలకు వచ్చిన బాంబు బెదిరింపు ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. ఈ మెయిల్లో “ఆపరేషన్ సిందూర్” విజయాన్ని ప్రస్తావిస్తూ , స్టేడియంలో బాంబు పేలుడు జరిపే ప్రయత్నం జరుగుతుందని హెచ్చరించారు. దీంతో స్టేడియం అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
బెదిరింపు మెయిల్ నేపథ్యంలో భద్రతా దళాలు స్టేడియం పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పరీక్షలు చేపట్టి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో, ఈ బెదిరింపు మరింత ఆందోళన కలిగిస్తోంది. మే 16న రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ను ఇక్కడే పంజాబ్ కింగ్స్తో ఆడనున్నారు.
More Breaking Telugu News
భారత్కి మద్దతుగా బ్రిటీష్ ఎంపీ..
ఆ నాలుగు జట్ల ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫామ్..
More Breaking Telugu New: External Sources
Bomb Threat : జైపూర్లో హైఅలర్ట్.. సవాయ్ మాన్సింగ్ స్టేడియంకు బాంబు బెదిరింపు