కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన కుమార్తె టి. వీణను విచారించడానికి కేంద్రం అనుమతి మంజూరు చేసింది. ఆమె కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై కంపెనీల చట్టం కింద కేసు నమోదు చేశారు.

సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఆమెపై కొచ్చిన్‌లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇదే కేసులో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. గతంలో విజయన్ కుమార్తె బంగారు అక్రమ రవాణా కేసులో ప్రమేయం ఉందని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *