Earthquake in Assam: భూప్రకంపనలు అంటే ఎవరైనా హడలెత్తిపోతారు. బతుకు జీవుడా అంటూ పరుగులు పెడతారు. కానీ అస్సాంలోని నర్సులు మాత్రం భయపడకుండా, తమ పని విధిగా శిశువులను కాపాడుతూ శెభాష్ అని చెప్పదలిచారు. భూమి కంపిస్తున్నా, వార్డులో ఉన్న చిన్న చిన్న శిశువుల పక్కన నిలిచి రక్షించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆదివారం అస్సాం, పశ్చిమ బెంగాల్లో భూకంపం వచ్చింది. అస్సాంలో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. నాగావ్లోని ఆసుపత్రి వార్డులో చిన్న చిన్న శిశువులు ఉన్నారు. ఆ సమయంలో ఇద్దరు నర్సులు వారిని కాపాడారు. భూకంపం వల్ల వస్తువులు ఊగిపోతున్నా, నర్సులు భయపడకుండా శిశువులను రక్షించారు. పిల్లలకు ఎలాంటి హాని కలగలేదు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు వారిని ప్రశంసిస్తున్నారు.
Internal Links:
ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన..
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపు..
External Links:
ఓ వైపు భూప్రకంపనలు.. ఇంకోవైపు వణికిన పిల్లల వార్డు.. అస్సాం నర్సులు ఏం చేశారంటే..!