ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1994 నుండి 2003 వరకు ఇస్రో ఛైర్మన్గా ఆయన కీలక పాత్ర పోషించారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఛాన్సలర్గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్గా కూడా ఆయన సేవలందించారు.
మోదీ ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షత వహించారు. 2004 నుండి 2009 మధ్యకాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్గా పనిచేశారు. శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో దేశ అభివృద్ధికి ఆయన అమూల్య సేవలందించారు. 2003 నుంచి 2009 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు.