Harivansh Narayan Singh

Harivansh Narayan Singh: బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్‌పై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ప్రశంసలు తెలిపారు. ప్రధాన పార్టీలు పట్టించుకోని సమస్యలను ప్రశాంత్ కిషోర్ లేవనెత్తారని, వాటి పరిష్కారానికి సమయం పడుతుందని చెప్పారు. electionల్లో కొన్ని సీట్లు జన్ సూరాజ్ పార్టీ సాధిస్తుందని జోస్యం చేశారు. జయప్రకాష్ నారాయణ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీలు 1967 నాటికి ప్రాథమిక ప్రజా సమస్యలను గణనీయంగా పరిష్కరించాయని గుర్తుచేశారు. అలాగే ప్రశాంత్ కిషోర్ లేవనెత్తిన సమస్యలు భవిష్యత్‌లో ప్రభావం చూపుతాయని హరివంశ్ నారాయణ్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ప్రశాంత్ కిషోర్ లేవనెత్తిన అంశాలను ఇతర పార్టీలు కూడా వినిపిస్తున్నప్పటికీ పెద్ద ఎత్తున అవి ప్రతిఫలించడం లేదని చెప్పారు. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా, ఇండియా కూటమి చివరి నిమిషంలో విభేదాల కారణంగా విడివిడిగా పోటీ చేస్తున్నది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్..

నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ షురూ..

External Links:

ఎన్నికల వేళ ప్రశాంత్ కిషోర్‌పై రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ప్రశంసలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *