India-Pakistan war

India-Pakistan war: అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) నివేదిక ప్రకారం, 2026లో భారత్–పాకిస్తాన్ మధ్య మళ్లీ యుద్ధ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడం వల్ల రెండు దేశాల మధ్య సాయుధ ఘర్షణ జరగవచ్చని పేర్కొంది. ఈ ఘర్షణ అమెరికా ప్రయోజనాలపై పెద్దగా ప్రభావం చూపకపోయినా, ప్రాంతీయ భద్రతకు మాత్రం ప్రమాదంగా మారవచ్చని నివేదిక తెలిపింది. అంతేకాదు, పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని CFR వెల్లడించింది.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన “ఆపరేషన్ సిందూర్”లో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. ఆ తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశాలు ఉండటంతో భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, రెండు దేశాలు తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. భారత్ భారీగా రక్షణ పరికరాల కొనుగోళ్లకు ఆమోదం ఇవ్వగా, పాకిస్తాన్ కూడా చైనా, టర్కీల నుంచి డ్రోన్లు, రక్షణ వ్యవస్థలు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

జోర్డాన్‌లో ప్రధాని మోడీ పర్యటన…

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబిన్..

External Links:

2026లో భారత్-పాక్ మధ్య యుద్ధం.! : యూఎస్ రిపోర్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *