భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమాసియాలో రోజురోజుకూ ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ రోజు నుండి ఆగస్టు 8 వరకు టెల్ అవీవ్ నుండి భారతదేశానికి విమానాలను నిలిపివేస్తున్నట్లు ఎయిర్లైన్ ప్రకటించింది.
అలాగే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సర్వీసుల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఇదిలా ఉండగా, ఆగస్టు 8వ తేదీ వరకు ఢిల్లీ-టెల్ అవీవ్ మధ్య ప్రయాణాల కోసం ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. టికెట్ల రద్దు, రీషెడ్యూలింగ్ పై ఒకసారి ఛార్జీల మినహాయింపు ఇస్తామని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.