Lt Gen Manoj Katiyar

Lt Gen Manoj Katiyar: భారత్‌పై మరోసారి పహల్గామ్ తరహా దాడికి పాకిస్తాన్ ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారత సైన్యం స్పష్టం చేసింది. వెస్ట్రన్ కమాండ్ GOC-in-C లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ జమ్మూలో మాట్లాడుతూ, పాక్ మరోసారి దుస్సాహసం చేస్తే ఆపరేషన్ సిందూర్ 2.0 మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. గత ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, సైనిక కేంద్రాలను పరిమిత స్థాయిలో ధ్వంసం చేశామని, కానీ భవిష్యత్తులో ప్రతిస్పందన మరింత ఘాటుగా ఉంటుందని అన్నారు.

లెఫ్టినెంట్ జనరల్ కటియార్ మాట్లాడుతూ, పహల్గామ్ దాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. 1965 భారత్-పాకిస్తాన్ యుద్ధం 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన మాజీ సైనికుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో పాక్ చేసే ఏ దాడినైనా తిప్పికొట్టడానికి భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల దేశభక్తిని తక్కువ అంచనా వేయడం పాక్ ఓటమికి కారణమని కూడా గుర్తు చేశారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ షురూ..

క్ష‌మాప‌ణ‌లు కోర‌ను.. బాధ‌ప‌డ‌ను…

External Links:

మరో ఆపరేషన్ సిందూర్‌ను తట్టుకోలేరు .. పాక్‌కు భారత సైన్యం వార్నింగ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *