అభివృద్ధి పనులను ప్రారంభించడానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రైలులో 150 కిలోమీటర్లు ప్రయాణించడం గమనార్హం. ఆయన రాష్ట్ర రాజధాని అగర్తల నుండి ధర్మనగర్ వరకు రైలు ప్రయాణం చేశారు. ధర్మనగర్‌లో 45 అభివృద్ధి పనులను ప్రారంభించడానికి ఆయన అగ‌ర్త‌ల‌లో రైలు ఎక్కారు.

ప‌దుల కిలోమీట‌ర్ల దూరానికే హెలికాప్ట‌ర్లు ఉప‌యోగించే సీఎంలు ఉన్న ఈ రోజుల్లో మాణిక్ సాహా ఇలా లాంగ్‌ ట్రైన్ జ‌ర్నీ చేయ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. రాష్ట్రంలో క‌నెక్టివిటీ పెరిగింద‌ని తెలియ‌చేయ‌డంతో పాటు త‌న సింప్లిసిటీని నిరూపించుకోవ‌డానికి ముఖ్య‌మంత్రి చేసిన ఈ ప్ర‌య‌త్నం సింప్లీ సూప‌ర్బ్ అని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *