Neeraj Chopra

Neeraj Chopra: భారత జావెలిన్ త్రోయర్‌, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌ ఇచ్చారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. నీరజ్ కుటుంబం కూడా ఈ వేడుకలో హాజరైంది. పట్టుదల, దేశభక్తికి నీరజ్ చోప్రా నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. ఆయన 2016లో నయిబ్ సుబేదార్‌గా ఆర్మీలో చేరి పలు పురస్కారాలు, పతకాలు గెలుచుకున్నారు.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ స్వర్ణ పతకం గెలిచి చరిత్ర సృష్టించారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు. అలాగే 2023 ప్రపంచ అథ్లెటిక్స్‌, ఏషియన్‌, కామన్‌వెల్త్‌, డైమండ్ లీగ్‌లలోనూ స్వర్ణ పతకాలు గెలిచారు. 90.23 మీటర్ల దూరం జావెలిన్ విసిరి రికార్డు సృష్టించారు. నీరజ్ క్రమశిక్షణ, పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని రక్షణ మంత్రి ప్రశంసించారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్..

నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ షురూ..

External Links:

లెఫ్టినంట్ క‌ల్న‌ల్‌గా నీర‌జ్ చోప్రా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *