నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన ఫిషింగ్ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం ప్రారంభించారు. ఓ బటన్ నొక్కి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, పరోక్షంగా ఈ హార్బర్ ఎంతో మందికి నిలయంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, జువ్వలదిన్నెలో నిర్మించిన ఈ ఫిషింగ్ హార్బర్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే అతి పెద్దది. ఈ ఫిషింగ్ హార్బర్ కు చంద్రబాబు 2018లో ముఖ్యమంత్రి హోదాలో శంకుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *