Prime Minister Modi In Srisailam: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈరోజు ఉదయం కర్నూలుకు ప్రత్యేక విమానంలో చేరిన ఆయన, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లతో కలిసి హెలికాప్టర్లో సున్నిపెంటకు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించారు. ఆలయానికి చేరుకున్న ప్రధానికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రుద్రాభిషేకం, కుంకుమార్చన సేవల్లో పాల్గొని, తీర్థ ప్రసాదం స్వీకరించారు.
ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 1500 మంది సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దర్శన కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ మధ్యాహ్నం 2:30 గంటలకు కర్నూలు బయల్దేరి వెళ్తారు. అనంతరం ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ పేరుతో కర్నూలులో జరుగనున్న బహిరంగ సభకు హాజరుకానున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పాక్కు వార్నింగ్ ఇచ్చిన లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్..
నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్ షురూ..
External Links:
శ్రీశైలం మల్లన్న సేవలో ప్రధాని మోదీ