హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నుండి కాంగ్రెస్లోకి ఫిరాయించిన రాజ్యసభ మాజీ ఎంపి కె. కేశవ రావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాల)గా కేబినెట్ మంత్రి హోదాలో నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.కేశవరావు తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసి గురువారం రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధంకర్కు సమర్పించారు. శుక్రవారం ఆయన రాజీనామాను ఆమోదించారు.తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేశవరావును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ వారం తొలినాళ్లలో ఢిల్లీ పర్యటనలో వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.