హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ తదుపరి సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురువారం తెలిపారు. సమావేశాల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.కరీంనగర్ ఇన్‌చార్జి మంత్రి హోదాలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగిపోవడంపై విజిలెన్స్ నివేదికను వచ్చే సభ సమావేశాల నాటికి సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక విచారణ కూడా తనకు అందలేదని, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కొనసాగుతోందని అన్నారు.తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం 13 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన మంత్రి, పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుంటుందన్న బీఆర్‌ఎస్ సిద్ధాంతం కాస్త విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్‌, బీజేపీల మధ్యే ఉంటుందని, బీఆర్‌ఎస్‌ లెక్కలో ఉండదని చెప్పారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *