భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. మన్మోహన్ మృతికి నివాళులర్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినాలు పాటించాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

మ‌రోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈరోజు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రి మండ‌లి భేటీ కానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *