రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలనే దానిపై ప్రాథమిక చర్చలు జరిగాయి.

తాజాగా ఈరోజు ఇరు రాష్ట్రాల సీఎస్ లు భేటీ అయ్యారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో వీరి సమావేశం కొనసాగుతోంది. విభజన అంశాలపై ఏపీలో జరుగుతున్న తొలి భేటీ ఇదే కావడం గమనార్హం. రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలపై అధికారుల కమిటీ చర్చిస్తోంది. 2024 జూలై 5న రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై మరింత లోతుగా వీరు చర్చిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *