2024-25 సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటు పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రం అభివృద్ధి పరంగా పురోగతి సాధిస్తోందని ఈ జాతీయ నివేదిక చెబుతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో స్పందించారు.
1990లో నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు, హైదరాబాద్ నగరం రెండవ స్థానంలో ఉంది. అప్పుడు బెంగళూరు నంబర్ వన్ స్థానంలో ఉంది. కానీ నేడు హైదరాబాద్ అన్ని రంగాలలో నంబర్ వన్ నగరంగా అయింది. అదే విధంగా, ఇవాళ మన ముందు ఒక కొత్త సవాలు లేదా కొత్త అవకాశం మన ముందు నిలిచింది. దీన్ని మనం అందిపుచ్చుకుని ముందుకెళ్లాలి. నెంబర్ 2 స్థానంలో ఉన్నామంటే మనం ఇంకా గట్టిగా కృషి చేయాలని అర్థం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.